కరోనా బాధితురాలితో పాత మిత్రుల గెట్ టు గెదర్

Published: Friday May 28, 2021
మధిర, ప్రజాపాలన ప్రతినిధి : 27వ తేదీబోనకల్ మండలం మోటమర్రి గ్రామానికి చెందిన నండ్రు జాన్ ఇటీవల కరోనాతో మృతి చెందాడు అతని భార్య కూడా కరోనా పాజిటివ్ ఆమెకు సీరియస్ గా ఉంది తెలుసుకున్న టెన్త్ క్లాస్ 1986-87 బ్యాచ్ మిత్రులు తమ చిన్ననాటి మిత్రుడు నండ్రు జాన్ కరోనాతో మరణించాడన్న వార్త తెలుసుకున్న మిత్రులు జాన్ కుటుంబాన్ని పరామర్శించుటకు (ఆరా తీయగా) వెళ్లగా ఆయన భార్య కూడా కరోనా పాజిటివ్ వచ్చి సీరియస్ గా ఉందని వారి ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలుసుకున్నా టెన్త్ క్లాస్ 1986-87 బ్యాచ్ మిత్రులు గెట్ టు గెదర్ అయ్యాయి. జాన్ కుమారుడు ప్రశాంత్ పిలిపించి మిత్రులందరూ కలసి మధిర సిఐ మురళి గారి చేతుల మీద ఆర్థిక సాయం యాభై వేల నాలుగు వందల యాభై రూపాయలు (50,450) అందజేశారు ఈ కార్యక్రమంలో మిత్రులు కరీం తూములూరి రాజా వేముల సతీష్ బిక్కి ప్రసాద్ బండి శ్రీనివాసరావు శివాజీ కూరపాటి హరి పాల్గొన్నారు ఈ సందర్భంగా మిత్రులందరూ జాన్ కుమారునికి ధైర్యం కల్పిస్తూ అధైర్య పడకు ధైర్యంగా ఉండు. అమ్మకు ఏమీ అవదు. మీ అమ్మ గారు త్వరగా కోలుకుంటారు. ఏ అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించు అని తెలిపారు