2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించిన ఏపీజీవీబీ బ్యాంకు వారు.

Published: Friday November 18, 2022

బూర్గంపాడు (ప్రజా పాలన.)

బూర్గంపాడు మండలం సారపాక ఏపీజీవీబీ  బ్యాంకులో స్వప్న వివో రాణి రుద్రమ్మ గ్రూపులో ముదిగొండ మాణిక్యం అనే సభ్యురాలు 420 రూపాయలు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ చేసుకోవడం జరిగినది . అయితే ప్రమాదవశాత్తు  ఆమె మరణించడం వల్ల రెండు లక్షల రూపాయల ఏపీజీవీబీ బీమా చెక్కును బూర్గంపాడు మండలం సారపాక గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్  మరియు బ్యాంకు సిబ్బంది స్వప్న వివో అరుణ,  బుక్ కీపర్ నాగమణి , చేతుల మీదగా వారి కుటుంబ సభ్యులకు  అందించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రమాద బీమాను తప్పనిసరిగా చేయించుకుంటే అది ఏదో ఒక రూపంలో మనకు ఉపయోగపడుతుందని బ్యాంకు మేనేజ్మెంట్ తెలియజేయడం జరిగినది.