2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించిన ఏపీజీవీబీ బ్యాంకు వారు.
Published: Friday November 18, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)
బూర్గంపాడు మండలం సారపాక ఏపీజీవీబీ బ్యాంకులో స్వప్న వివో రాణి రుద్రమ్మ గ్రూపులో ముదిగొండ మాణిక్యం అనే సభ్యురాలు 420 రూపాయలు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ చేసుకోవడం జరిగినది . అయితే ప్రమాదవశాత్తు ఆమె మరణించడం వల్ల రెండు లక్షల రూపాయల ఏపీజీవీబీ బీమా చెక్కును బూర్గంపాడు మండలం సారపాక గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్ మరియు బ్యాంకు సిబ్బంది స్వప్న వివో అరుణ, బుక్ కీపర్ నాగమణి , చేతుల మీదగా వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రమాద బీమాను తప్పనిసరిగా చేయించుకుంటే అది ఏదో ఒక రూపంలో మనకు ఉపయోగపడుతుందని బ్యాంకు మేనేజ్మెంట్ తెలియజేయడం జరిగినది.
Share this on your social network: