ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 14ప్రజాపాలన ప్రతినిధి

Published: Tuesday November 15, 2022
సోమవారం రోజు ఇబ్రహింపట్నం అసెంబ్లీ ఆదిభట్ల మున్సిపాలిటీ అధ్యక్షులు బంగారిగళ్ళ మహేందర్ గారి ఆధ్వర్యంలో ఆదిభట్ల మున్సిపాలిటీ కంగరకలాన్ గ్రామంలోని సర్వే నెంబర్ 339లో గోపగళ్ళ యాదయ్య  3.12 గుంటల భూమిలో నుండి 2 ఎకరాలు అమ్ముకోగా మిగిలిన 1.12 గుంటల భూమినీ కొంత మంది రియల్ ఎస్టేట్ భూ కబ్జాదారులు గోపగళ్ల యాదయ్య గారి భూమినీ 340, 341 సర్వేనెంబర్లు గా మార్చి కబ్జాకు పాలుపడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపైన చర్యలు తీసుకోవాలనీ, అధికారులు తక్షణమే స్పందించి సర్వే చేసి బాధితుడికి న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహింపట్నం అసెంబ్లీ* తరుపున డిమాండ్ చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో..
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్
అసెంబ్లీ కోశాధికారి కొండ్రు రఘుపతి
ఆదిభట్ల మున్సిపాలిటీ అధ్యక్షులు బంగారిగళ్ళ మహేందర్  యాచారం మండల కన్వీనర్ గోరటి కుమార్ , పెద్ద అంబర్ పెట్ మున్సిపాలిటీ అద్యక్షులు యాంజాల ప్రహ్లాద్  పోల్కంపల్లీ సెక్టార్ BVF కన్వీనర్ పెద్దముత్తనీ గణేష్  , గోరటి జగదీశ్వర్, ధార రాఘవేందర్, కొప్పు వంశీ, రాoబాబు తదితరులు పాల్గొన్నారు.