రెండు బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
Published: Wednesday March 17, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన మండలంలోని నేమిలేకాల్వ స్టేజి వద్ద మంగళవారం చోటు చేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామానికి చెందిన ఎడ్ల సతీష్ వలిగొండ నుండి స్వగ్రామానికి వెళుతుండగా ఎదురుగా మోటారు సైకిల్ పై వస్తున్న మండలంలోని దుప్పల్లి గ్రామానికి చెందిన నల్లబోలు మత్స్యగిరి ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 వాహనంలో రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు 108 సిబ్బంది తెలిపారు.
Share this on your social network: