దర్గాలో ట్యాంకర్ల ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి

Published: Monday May 10, 2021
శేరిల్ంగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దర్గాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి శనివారం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. దీంతో డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి ట్యాంకర్ల ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. దర్గా లో అడుగడుగున కరోనా క్రిమి సంహారక మందును స్ప్రే చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కరోన ఉదృతి నేపథ్యంలో దర్గా వాసులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, అవసరం అయితే తప్ప బయటకి రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్యామ్ యాదవ్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.