కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజల ఆకాంక్ష

Published: Monday March 13, 2023
 * మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 12 మార్చి ప్రజాపాలన : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డుకు సంబంధించిన కొత్రేపల్లి గ్రామంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్లి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరించామని అన్నారు. ప్రజల కోసం చేయబోయే కార్యక్రమాలను క్లుప్తంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలొ కాంగ్రెస్ నాయకులు వి. సత్యనారాయణ, కిషన్ నాయక్, రత్నా రెడ్డి, నర్సిములు, మురళి, వేణు గోపాల్ రెడ్డి, విజయ్ కుమార్, శ్రీకాంత్, ఆనంద్, హాజీపాషా, కిష్టారెడ్డి, యాదగిరి, ఎక్బాల్, శేఖర్,జాఫర్, సతీష్ రెడ్డి, సంతోష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.