ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన : కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

Published: Monday July 19, 2021
మేడిపల్లి, జూలై 18 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ డివిజన్ శాంతి నగర్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని స్థానిక కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్లోని శాంతి నగర్లో మ్యాక్స్ విజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు డివిజన్లోని ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్, లింగంపల్లి రామకృష్ణ, అల్వాల్ భాస్కర్, జనగం రామకృష్ణ, అలుగల అనీల్ కుమార్, బోరంపేట్ జై కృష్ణ, గోరిగే నగేష్, మంద మురళీ కృష్ణ రెడ్డి, పాలడుగు లక్ష్మణ్, జిత్తు రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కన్నమైన నరేష్, చిట్టి, తైసీన్, తూప్రాన్ అనిత, గట్టు ఇందిరా, పెంటమ్మ, వై. విజయ, రఘు, శివ తదితరులు పాల్గొన్నారు.