సైదల్లిపురం గ్రామ పంచాయతీ నందు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన గ్రామ సర్పంచ్

Published: Wednesday March 09, 2022
మధిర మార్చి 8 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం పరిధిలో మంగళవారం నాడు సైదల్లి పురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పురుషులతో పాటు మేము సైతం అని పోటీ పడే ఈ సమాజంలో స్త్రీ లేకపోతే జననం లేదు గమనం లేదు మరియు సృష్టికి జీవం లేదు, స్త్రీ మూర్తి కి సలాం చేస్తూ సైదల్లి పురం గ్రామ పంచాయతీ నందు గ్రామ సర్పంచ్ పులిబండ్ల చిట్టి బాబు ఆధ్వర్యంలో వార్డ్ సభ్యులకు అంగన్వాడీ ఆయాకు గ్రామ దీపికలకు మధిర మండల ఎంపీడీవో విజయభాస్కర రెడ్డి సమక్షంలో చీర, సారేలతో సన్మానించి గౌరవించటం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ గ్రామ పెద్దలు మొదలగువారు పాల్గొన్నారు.