జిల్లా నాయకుల ప్రత్యేక పూజలు తో ఆహ్వాన పత్రిక పంపిణీ

Published: Thursday July 21, 2022
పాలేరు జూలై 20 ప్రజాపాలన ప్రతినిధి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉదయం ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నేలకొండపల్లి ప్రధమ పౌరుడు  అయినటువంటి నేలకొండపల్లి సర్పంచ్. రాయపూడి నవీన్ దంపతులకు మొదటి శుభలేఖ అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మద్దినేని స్వర్ణ కుమారి, నెల్లూరి భద్రయ్య, కొర్లకుంట నాగేశ్వరరావు, గంజికుంట్ల వెంకన్న, గండికోట సుబ్రహ్మణ్యం, కాసాని నాగేశ్వరరావు, మానుకొండ దుర్గారావు,మైసా శంకర్, వాక దాని శ్రీనాథ్,  జాన్ రెడ్డి , ఇస్లావత్ బాలాజీ, రాయపూడి శ్రీనివాసరావు, కడియాల నరేష్, తదితరులు పాల్గొన్నారు