పిడుగు పడి నాలుగు గోర్లు మృత్యువాత

Published: Monday October 18, 2021

కోరుట్ల,అక్టోబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో శనివారం కురిసిన అకాల పిడుగులతో కూడిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జోగన్ పల్లి గ్రామానికీ చెందిన పంచతి బోత్తన్న అనే గొర్ల కాపరి యొక్క గొర్ల మందపై పిడుగు పడడం వలన నాలుగు గోర్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. అకాల వర్షాలనీకి తీవ్ర నష్టం జరిగిందని బోత్తాన్న ఆవేదన చెందాడు.