రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
బోనకల్, జనవరి 8 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని బొనకల్- మోటమర్రి రైల్వే స్టేషన్ల మధ్య సాయంత్రం 6 గంటలకు కిలోమీటర్ నంబర్ 518/28-30 వద్ద పట్టాలపై గోవిందాపురం ఏ గ్రామ సమీపంలో ఎగువకు వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి రైలు బండి లో నుండి ప్రమాదవశాత్తు జారిపడి ఒక గుర్తు తెలియని పురుషుడు వయస్సు సుమారు 30 సంవత్సరాలు గల వ్యక్తి రైలు బండి నుండి ప్రమాదవ శాత్తు జారిపడి మరణించినాడు.ఇట్టి వ్యక్తి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఇతను వద్ద లభించిన రైల్ టిక్కెట్ ఆధారంగా ఇతను విజయవాడ నుండి భద్రాచలం రోడ్ వెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు తెలుస్తున్నది. ఇట్టి వ్యక్తి శవాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీ నందు గుర్తుపట్టుట కొరకు భద్రపరచుడమైనది. ఈ ఫోటోలో గల వ్యక్తిని మీరు గుర్తించిన ఎడల ఈ క్రింది ఫోన్ నెంబర్లకు తెలియపరచగలరు. ఇట్టి కేసు ను ఖమ్మం జి ఆర్ పి ఎస్సై పి భాస్కర్ రావు నమోదు పరచగా మధిర ఆర్ఓపి ఎస్ వేణు గోపాలరెడ్డి, దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని అన్నం సేవా ఫౌండేషన్ ఫౌండర్ అన్నం శ్రీనివాసు రావు, సిబ్బంది సహకారం తో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించడం జరిగినది.
Share this on your social network: