పాత్రికేయులకు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మిషన్ అందచేత

Published: Monday May 24, 2021
కోరుట్ల, మే 23 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల నియోజక వర్గ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు టి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డా.కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్ కి పాత్రికేయుల కోసం ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరిడెంట్ డా.నవీన్ కి ఆసుపత్రి సిబ్బంది కోరకై ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అన్నం అనీల్, ప్రధానకార్యదర్శి గుడ్ల మనోహర్, మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, రైతు సమన్వయ జిల్లా అధ్యక్షులు చీటి వెంకట్రావు, కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు