ప్రారంభమైన పాఠశాలలు.. హాజరైన విద్యార్థులు

Published: Thursday September 02, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 1, ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్థానిక ఉపాధ్యాయులు పాఠశాలను ప్రారంభించారు. గత సంవత్సరం మూతపడిన పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రారంభం కావడంతో విద్యార్థులు సంతోషంగా పాఠశాలలకు రావడం మొదలుపెట్టారని, పాఠశాలలు మొదలు కావడానికి ముందుగా స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా తగిన చర్యలు తీసుకున్నామని పలువురు ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు తెలిపారు. ఈరోజు మొదటి రోజు కావడంతో విద్యార్థుల సంఖ్య తక్కువే అయినా ఎంతో హుషారుగా విద్యార్థులు పాఠశాలలకు హాజరైనారని హాజరైన విద్యార్థులకు ప్రార్ధన సమయంలోనే కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా తగిన శిక్షణ ఇచ్చి ప్రతి ఒక్కరిని శానిటైజేషన్ చేసి మాస్కులతో లోపలికి పంపించామని, పలువురు  ఉపాధ్యాయులు తెలిపారు.