నిరంతరంగా రేషన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియ

Published: Saturday June 12, 2021
మధిర, జూన్ 11, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీత్వరలోనే అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు. తహసీల్దార్ డి.సైదులుకొత్తగా రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకునే వారు, రేషన్ కార్డులో పిల్లల పేర్లు చేర్పులు, మార్పులు చేసుకునేవారు మీ సేవ సెంటర్లో దరఖాస్తులు సమర్పించాలని తాసిల్దార్ సైదులు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అన్నారు.అర్హులను గుర్తించి అధికారులు ఆహార భద్రత కార్డులు మంజూరు చేస్తారని తెలిపారు. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క దరఖాస్తు తాసిల్దార్ కార్యాలయం వస్తాయని, రెవిన్యూ ఇన్స్పెక్టర్ ప్రాథమిక విచారణ జరిపి దరఖాస్తులను తాసిల్దార్ సమర్పిస్తారని కాబట్టి ఎవరూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.