వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలి

Published: Tuesday March 02, 2021
మేడిపల్లి, మార్చ్1 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పీర్జాదిగూడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో చెన్నూరు శాసన సభ్యులు బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, రాష్ట్ర నాయకులు శ్రీధర్ రెడ్డి, చామకూర భద్రా రెడ్డి పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎంపల్ల అనంత్ రెడ్డి, కౌడే పోచయ్య, కేతావత్ సుభాష్ నాయక్, మద్ది యుగేందర్ రెడ్డి, పిట్టల మల్లేష్, కోఆప్షన్ సభ్యులు బొడిగే రాందాస్ గౌడ్, షేక్ ఇర్ఫాన్, నాయకులు పప్పుల అంజి రెడ్డి, బైటింటి ఈశ్వర్ రెడ్డి, బొడిగే కృష్ణ గౌడ్, అలువాల దేవేందర్ గౌడ్, చెరుకు పెంటయ్య గౌడ్, జావిద్ ఖాన్, మనోరంజన్ రెడ్డి, నిర్మల, రఘువర్ధన్ రెడ్డి, డివిజన్ ఇంచార్జ్ లు, తదితరులు పాల్గొన్నారు.