సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మీ రమేష్

Published: Saturday August 06, 2022

మధిర ఆగస్టు 5 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని 21వ వార్డు కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మీ రమేష్ కోరారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 21వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె కోరారు. విష జ్వరాలు సోకకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పుల శివ ఆర్పి యామాల రత్న కుమారి ఆశా వర్కర్ జ్యోతి అంగన్వాడి టీచర్ విజయ కుమారి పాల్గొన్నారు.