నేడు జిల్లాలో రాష్ట్ర మంత్రి పర్యటన

Published: Wednesday July 07, 2021
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూలై 6, ప్రజాపాలన : జిల్లాలో ఈ నెల 7, బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించనున్నట్లు మంత్రి పి.ఎస్. సిహెచ్. సత్యనారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గం॥ల వరకు కిష్టంపేట గ్రామంలో ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్ తో కలిసి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు. 9.30 గం||లకు అక్కడి నుండి బయలుదేరి జోడువాగుల గ్రామానికి చేరుకొని 10 గం॥లకు అర్బన్ ఫారెస్ట్ ప్రాంతంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 11 గం॥లకు జోడుగువాగుల గ్రామం నుండి బయలుదేరి 12 గం॥లకు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావుతో కలిసి లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.