మధిరలో సుడిగాలి పర్యటన చేసిన మల్లాది

Published: Monday October 18, 2021
మధిర, అక్టోబర్ 17, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారి విగ్రహాలను ఈ రోజు నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో, ఊరేగింపులో టిఆర్ఎస్ అగ్రనేత మల్లాది వాసు అన్ని విగ్రహాల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు. ముందుగా మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద జరిగిన పూజల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరావు మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం సుందరయ్య నగర్లో ఆజాద్ రోడ్లోని ఫ్రెండ్స్ యూత్ ఏర్పాటు చేసిన విగ్రహాలు వద్దకు వెళ్ళి పూజలు నిర్వహించి ఊరేగింపులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు గూడేల్లి నాగరాజు, ఆవుల కృష్ణ, నాగబాబు  తదితరులు పాల్గొన్నారు.