ప్రభుత్వ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు..* హాజరైన పాస్టర్ రెవరెండ్ తిమోతి..*

Published: Saturday December 24, 2022
తల్లాడ, డిసెంబర్ 23 (ప్రజా పాలన న్యూస్):
తల్లాడలోని ఎస్సీ కాలనీలో ఉన్న  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. పాస్టర్ తిమోతి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాసరావు, అంగన్వాడీ టీచర్ వరలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.* 
 
 *వితంతువులకు చీరలు పంపిణీ..* 
 
 *ఖమ్మంలోని వరంగల్ వెళ్లే క్రాస్ రోడ్ లో లెప్రసీ కాలనీలో కుష్టు రోగులకు చీరలు పంపిణీ చేశారు. వీటిని పాస్టర్ డి. తిమోతి చేతుల మీదుగా వారికి అందించారు. స్థానిక పాస్టర్ సామ్యూల్, రేచల్ దంపతులు దాతగా వారికి సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా తిమోతి మాట్లాడుతూ పేద వారికి చేయూతను అందించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.*