నిండు జీవితానికి రెండు చుక్కలు

Published: Thursday March 03, 2022

కోరుట్ల, ఫిబ్రవరి 27 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలము లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయిలాపుర్ గ్రామంలో  ఆదివారం రోజున పోలియో చుక్కల కార్యక్రమన్ని కోరుట్ల జెడ్పీటీసీ సభ్యురాలు దారిషెట్టి లావణ్య రాజేష్ లు ప్రారంభించారు. ఆనంతరం జెడ్పీటీసీ సభ్యురాలు దారిషెట్టి లావణ్య రాజేష్ మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలకు  తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు గ్రామ సర్పంచ్ ధారిషేట్టి రాజేష్, ఎంపీటీసీ చెపూరి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం మల్లారెడ్డి, ఎచ్.ఈ.ఓ భూమేశ్వర్, సీ.ఎచ్.ఈ హరి, ఎచ్.ఎస్ జెస్సీ, ఏ.ఎన్.ఎం రజిత, ఆశ వర్కర్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.