అశ్వాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరిక. అశ్వాపు
Published: Wednesday October 19, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం MLA క్యాంపు కార్యాలయంలో అశ్వాపురం మండల BRS పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నుంచి 20 కుటుంబాలు BRS పార్టీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు సమక్షంలో BRS పార్టీలో చేరారు.,వారికి గులాబీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు మాట్లాడుత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీల నేతలు BRS పార్టీలో చేరడం అభినందన నియమని అన్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, కార్యకర్తలు నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు., దేశంలోనే ఎక్కడలేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే అమలవుతున్నాయని అన్నారు., సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సీనియర్ నాయకులు సుదిరెడ్డి గోపి రెడ్డి,చిలక వెంకటరమయ్య,పిట్టా శ్రీను,కడారి శేఖర్,సతీష్,BRS పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: