వాయు కాలుష్యం నివారణే లక్ష్యం : హైదరాబాద్ బస్ డిపో మేనేజర్ దైవాదనం

Published: Tuesday July 20, 2021
వికారాబాద్ 19 జూలై ప్రజాపాలన బ్యూరో : వికారాబాద్ బస్ డిపోలో వాయు కాలుష్యం నివారణే లక్ష్యంగా మొక్కలు నాటుతున్నామని డిపో మేనేజర్ దైవాదీనం అన్నారు. సోమవారం వికారాబాద్ డిపోలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చని చెట్లతో స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని గుర్తు చేశారు. డిపోను అంతా పచ్చందాల హరివిల్లుగా తీర్చి దిద్దుటకు ప్రత్యేకంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. మొక్కలు నాటిన ప్రతి ఒక్కరు పెంచి పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. డిపో సిబ్బంది పర్యవేక్షణలో ప్రతి ఒక్క మొక్క బతికేటట్లు రక్షణ చర్యలు చేపడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐ ఉమా శంకర్, ఎస్టిఐవివి నాయక్, ఆర్టీసీ హెడ్ గార్డ్ ఎల్లప్పలతో సహా ఆర్టీసీ సిబ్బంది మరియు సెక్యూరిటీ విభాగం వారు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.