ఎర్ధండి, గోదావరి నాదిని పరిశీలించిన, తాసిల్దార్

Published: Wednesday September 29, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 28, ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని, భారీగా కురుస్తున్న వర్షంతో వరద ప్రవాహం వస్తుండటంతో ఎర్దండి గోదావరిని తహశీల్దార్ రమేష్, ఎస్సై రాజాప్రమీల, పరిశీలించారు, తాసిల్దార్ మాట్లాడుతూ గోదావరి ప్రవాహం తగ్గేవరకు పరివాహక ప్రాంతకు జాలర్లు ఎవరు చేపల వేటకు వెళ్లకూడదని ప్రజలు గోదావరి వైపు వెళ్లకుండా గ్రామం మైక్ లో చెప్పించారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ భూమేశ్, వీఆర్వో సంజీవ్, కల్లెడ గంగాధర్, వీఆర్ఏలు లు గ్రామ ప్రజలు ఉన్నారు.