దైవచింతనతోనే మానసిక ప్రశాంతత
Published: Wednesday December 28, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 27 డిసెంబర్ ప్రజా పాలన : దైవచింతనతోనే మానసిక ప్రశాంత త లభిస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో చిగుళ్లపల్లి మైదానంలో అతిరుద్ర మహా యజ్ఞ సప్తాహం ముగింపు కార్యక్రమం సందర్భంగా వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆయన సతీమణి డాక్టర్ సవిత ఆనంద్ శివలింగము పై జలాభిషేకం చేశారు. వికారాబాద్ ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహా యజ్ఞ సప్తాహం కార్యక్రమం దిగ్విజయంగా ఏడు రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.
Share this on your social network: