పట్టణంలోని రహమత్ నగర్ ను అబ్దుల్ కలాం చౌక్ గా గుర్తించాలి ** పట్టణ మైనార్టీ నాయకులు

Published: Saturday November 19, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 18 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఆసిఫాబాద్ పట్టణంలోని రహమత్ నగర్ ను మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చౌక్ గా గుర్తించాలని మైనార్టీ నాయకులు కోరారు. శుక్రవారం రహమత్ నగర్ లోని చౌక్ వద్ద ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ తాము ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిపాదించాలని ప్రభుత్వం ఈ చౌక్ ను ఏపీజే అబ్దుల్ కలాం చౌక్ గా నామకరణం చేసి గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు అబ్దుల్ ఫయాజ్, అమ్మద్ బిన్ అబ్దుల్లా, అబ్దుల్ రహమాన్ (జర్నలిస్ట్) షబ్బీర్, సాజిద్, సాలం, నిస్సార్, ఎండి ఆమ్మద్, జాఫర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.