కోదాడ సభకు హోంమంత్రిని ఆహ్వానించిన నాయకులు..

Published: Thursday November 03, 2022
కొణిజర్ల, నవంబర్ 2 (ప్రజాపాలన న్యూస్):
నవంబర్ 20వ తేదీన కోదాడ లో జరిగే బహిరంగ సభకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ ఆలీని తెలంగాణ లంబాడి సేవా  సమితి నాయకులు ఆహ్వానించారు. బుధవారం హైదరాబాదులోని హోంమంత్రి నివాసంలో ఆయనను తెలంగాణ లాంబాడీ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్,  రాష్ట్ర అధ్యక్షులు బాధావత్ సైదులు నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సభకు సంభదించిన కరపత్రాన్ని ఆయన చేతుల మీదగా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సభకు హోంమంత్రిని ఆహ్వానించినట్లు తెలిపారు. అదేవిధంగా పోలీసుల అనుమతి కోసం ఆయనను కలిసి వినతిని అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతృ నాయక్, జిల్లా కార్యదర్శి జర్పుల ప్రసాద్, తదితరులు ఉన్నారు.*