ఇల్లూరు ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాద్యాయుడు వెంకట్రావు వితరణ.
Published: Thursday November 25, 2021
మధిర నవంబ24 ప్రజాపాలన ప్రతినిధి మధిర : మండలంలోని ఇల్లూరు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు ,అదే పాఠశాలకు చెందిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు. సుమారు 2800 రూపాయలు విలువ చేసే సోలార్ లైట్లు ఉచితంగా అందచేసినారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ శ్రీ కోట రామారావు మాట్లాడుతూ విద్యుత్ కోత సమయాల్లో ఈ లైట్లను ఉపయోగించుకొని బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం సోలారులైట్ల దాతను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు గారు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
Share this on your social network: