కరోనా విజేతలకు నాయక్ భరోసా విజయ జ్ఞాపిక అందుచేత

Published: Tuesday August 17, 2021
బోనకల్లు, ఆగస్టు 16 ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండల కేంద్రంలో కరోనా నుండి కోలుకొని విజయం సాధించిన ప్రతి ఒక్క కుటుంబానికి నాయక్ భరోసా సహాయక బృందం మరియు కోవిడ్ వారియర్స్ టీమ్ ఆత్మీయంగా పలకరించి కరోనా పై విజయానికి చిహ్నంగా విజయ జ్ఞాపికను బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ కో కన్వీనర్ శ్రీదేవి కొలిపాక, బోనకల్ సర్పంచ్ సైదా నాయక్, వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రవి జంపాల, దళిత గిరిజన సాధికారత అధ్యక్షులు పుల్లారావు చేతుల మీదుగా అందించారు తర్వాత నాయక్ భరోసా కార్యక్రమ రూపకర్త బీపీ నాయక్ కు,చిరు సన్మానం చేయగా ఈ సత్కారాన్ని నాయక్ టీం సభ్యులకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ వారియర్స్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.