వైరా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా.. వైయస్సార్ టీపీ వైరా ఇంచార్జ్ రామ్ నాయక్..
Published: Tuesday December 20, 2022
వైరా, డిసెంబర్ 19 (ప్రజాపాలన న్యూస్):
*వైరా నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైయస్సార్ తెలంగాణ పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ ధర్మసోత్ రామ్ నాయక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన వైరాలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలమ్మ పాదయాత్ర చేపట్టిందన్నారు. ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో షర్మిలమ్మ పోటీ చేస్తుందని, ఖమ్మం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. ఎమ్మెల్సీ తాత మధు నిరాధారణమైన ఆరోపణలు చేయటం సరైనది కాదన్నారు. బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలపై తమ పార్టీ పోరాటాలు చేస్తుందని అన్నారు. గతంలో బిజెపి ప్రభుత్వానికి నల్ల చట్టాలు తీసుకొస్తే మద్దతు పలికింది టిఆర్ఎస్ కాదా అని విమర్శించారు. బిజెపికి వదిలిన బాణం షర్మిలమ్మ అని టిఆర్ఎస్ వారు విమర్శలు చేయటం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్టిపి బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు.*
Share this on your social network: