ఖమ్మం ధర్నాలో పాల్గొన్న జడ్పీటీసీ ప్రమీల, రెడ్డేం వీరమోహన్ రెడ్డి..

Published: Saturday December 24, 2022
తల్లాడ, డిసెంబర్ 23 (ప్రజాపాలన న్యూస్):
 కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను, రైతు కల్లాలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఖమ్మం ధర్నా చౌక్ లో బీఅర్ఎస్  పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ  ధర్నాకు తల్లాడ జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, బీఅర్ఎస్ మండల అధ్యక్షులు రెడ్డేం వీరమోహన్ రెడ్డి హాజరై కేంద్రప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.* 
 *ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెద్దపీట వేస్తూ పెట్టుబడి సహాయంగా రైతుబంధు, రైతు మరణిస్తే ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు రైతు బీమా, ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోందని గుర్తుచేశారు.  దేశవ్యాప్తంగా రైతుల్లో కేసీఆర్ పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కేంద్రప్రభుత్వం ఇలాంటి పనికిమాలిన చర్యలకు పాల్పడుతోందని రానున్న రోజుల్లో ఆ పార్టీకి రైతులే తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు. *ఈ కార్యక్రమంలో  టిఆర్ఎస్ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావు, పట్టణ అధ్యక్షులు జివిఆర్, అంబేద్కర్ నగర్ సర్పంచ్ జొన్నలగడ్డ కిరణ్ బాబు, వార్డ్ మెంబర్ రఘు పాల్గొన్నారు.*