తాడికల్ గ్రామ పంచాయితీలో తనిఖి నిర్వహించిన జిల్లా అంబుడ్స్మన్ శంకరపట్నం డిసెంబర్ 02 ప్రజాప
Published: Saturday December 03, 2022
శంకరపట్నం మండల కేంద్రంలోని తాడికల్ గ్రామం గ్రామపంచాయతీలో ఈరోజు జిల్లా అంబుడ్స్ మాన్ (విచారణ అధికారి) ఆడెపు లక్ష్మీనారాయణ తనిఖీ నిర్వహించారు గ్రామపంచాయతీలోని ఏడు రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న అవకతవకలు కలిగిన 9849278969 చరవాణి ద్వారా ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. గ్రామపంచాయతీ ఆవరణలో ఉపాధి కూలీలకు ఫిర్యాదు బాక్సులను అమర్చాలని వాల్ పోస్టర్ మరియు ఫిర్యాదు రిజిస్టర్ ఏర్పాటు చేయాలని గ్రామపంచాయితీ సిబ్బందికి ఆయన సూచించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, గ్రామీణ క్రీడ ప్రాంగణం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ సమ్మ రాజేశ్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: