మీర్ పేట్ కార్పొరేషన్లో మంచి నీళ్లు ఇవ్వాలని వినతి

Published: Thursday May 27, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : పలు డివిజన్లలో మంచినీళ్లు రోజు తప్పించి రోజు రావడంలేదని డబ్ల్యు. ఏం. హెచ్. ఎస్. జనరల్ మేనేజర్ కు, ఏ ఇ మహేష్ కు బీజేపీ నేతలు వినతి. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ, 25వ, 8వ, 33వ, డివిజన్లలో మంచి నీరు సరిగా రావడం లేదని, బిజెపి ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, బిజెపి కార్పోరేటర్లు ఆధ్వర్యంలో బుధవారం నాడు డబ్ల్యు, ఎం, హెచ్, ఎస్, జనరల్ మేనేజర్ కు A.E. మహేష్ కు వినతి. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ..... పలు డివిజన్లలో రోజు తప్పించి రోజు మంచి నీళ్లు రావడం లేదని అన్నారు. కార్పోరేషన్ లోని ప్రజలు గతంలో జనాభా తక్కువగా ఉండే అప్పుడు ఉన్న గ్రామపంచాయతీ పరిధిలో లెక్క ప్రకారమే వాటర్ ఇప్పుడు ఇస్తున్నారని వివిధ కాలనీలో ప్రజలు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కనీసం కార్పొరేషన్ అయినా కూడా మంచినీళ్లు ప్రజలకు రోజు తప్పించి రోజు ఇవ్వాలని అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటినుంచైనా పలు డివిజన్లలో కాలనీవాసులు అందరికీ డే బై డే మంచినీరు ఇవ్వటానికి సంబంధిత అధికారులు సహకరించి మంచి నీరును ఇవ్వగలరని బిజెపి నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పసునూరి బిక్షపతి చారి. కీసర హరినాథ్ రెడ్డి. భీమ్ రాజ్ కోడూరు సోమేశ్వర్. మహేష్ తదితరులు పాల్గొన్నారు.