ధర్మపురి అరవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రవి కుమార్ యాదవ్, వి.గంగాధర్ రెడ్డి

Published: Thursday August 26, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పుట్టిరోజు సందర్భంగా బంజారాహిల్స్ లోని వారి నివాసంలో రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి కాలువాతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, రాష్ట్ర బీజేవైఎం కోశ అదికారి మారబోయిన రఘునాథ్ యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్, శెరిలింగంపల్లి ప్రొఫెషనల్ సెల్ కన్వీనర్  సాయి కిరణ్, సీనియర్ నాయకులు, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, కిరణ్, రాము, అర్జున్, గణేష్ ముదిరాజ్, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.