బీజేపీ కార్యకర్తలు తెరాసకు భయపడరు
Published: Friday January 28, 2022
బీరుపూర్, జనవరి 27 (ప్రజాపాలన ప్రతినిధి): ఇటీవల నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పై జరిగిన దాడిని బీరుపూర్ మండల్ కేంద్రంలో నిరసిస్తూ తెరాసకు బీజేపీ కార్యకర్తలు దాడులకు దౌర్జన్యాలకు భయపడే కార్యకర్తలు కాదని ధైర్యం దమ్మున్న కార్యకర్తలని ఎంపీ అర్వింద్ పై దాడి పిరికిపందల చర్యగా భావించి తెరాసకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ బిజెపి మండల్ అధ్యక్షడు ఎనగందుల చంద్రశేఖర్ కోట కిషన్ మ్యాడ జనార్దన్ మడిశెట్టి శ్రీను పర్వతం వెంకటేష్ భూపతి నర్సింగ్ చిక్రం మారుతి చిర్నేని భాస్కర్ పత్తి రవి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: