కోవిడ్ పై అవగాహన సదస్సు

Published: Thursday May 20, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు బుధవారం కళజాతర సమావేశంలో కోవిడ్ వాక్సినేషన్ అపోహలు నమ్మొద్దని ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ వేసుకోవాలని డాక్టర్ కె.కిరణ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోల్లా లలిత శీనివాస్, ఉపసర్పంచ్ మైసోళౣ మత్స్య గిరి, వార్డ్ మెంబర్ సంతోష్, సుధాకర్. సంతోష్ కుమార్, ఏ.పీ.ఎం.ఓ. చందు, శ్రీలక్ష్మి, ఏ.ఎన్.ఎం. ఆశాలు గీత, ధనలక్ష్మి, సుజాత, లక్ష్మీ, సత్యవతి, థెరీసా, సభిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.