పురుగుల మందు తాగి వ్యక్తి మృతి.
Published: Thursday February 25, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 24, ప్రజాపాలన: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బాటన్ననగర్ గ్రామానికి చెందిన మాడె లక్ష్మయ్య (38) గత మూడు నెలలుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం భార్య జ్యోతి పనికి వెళ్లగా ఎవరు లేని సమయంలో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల వారు 108 కు సమాచారం అందించి వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య పిర్యాదు మేరకు ఆళ్ళపల్లి ఎస్ఐ సంతోష్ కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం తరలించారు.
Share this on your social network: