ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మృతికి ఎస్.టి.యూ సంతాపం

Published: Friday February 12, 2021
ఎస్.టి.యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు
 
వెల్గటూర్, మార్చి 11 (ప్రజాపాలన): వెల్గటూర్ మండలం గొడిసేలపేట ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాద్యాయులుగా పని చేస్తున్న శ్రీనివాస్ బుధవారం ధూళికట్ట లో బుధవారం రాత్రి కారు అదుపు తప్పి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలు కావడముతో శ్రీనివాస్  మృతిచెందాడు, కారులో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు వారికి స్వల్ప గాయాలయ్యాయి అయినవి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎస్.టి.యు జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్ సంతాపం వెలిబుచ్చారు. శ్రీనివాస్ ఎస్.టి.యు సంఘంలో మండల, జిల్లా వివిధ స్థాయి బాధ్యతల్లో తన సేవాలందించారని గుర్తు చేశారు. వారి అకాల మరణం ఎస్.టి.యు సంఘానికి తీరని లోటు అని వారు పేర్కొన్నారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.ఎస్.టి.యు మండల శాఖ అధ్యక్ష కార్యదర్శి లు సమ్మయ్య, సత్యం, వేణుగోపాల్, రమేష్, జీవన్, రవి, జీవన్, లక్ష్మీ నారాయణ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.