రజక సంఘం ఆధ్వర్యంలో...

Published: Monday August 16, 2021
మండల పరిధిలోని వెల్వర్తి గ్రామంలో 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామంలోని వీరభద్ర రజక సేవా సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కాల్కురి సత్తయ్య మాట్లాడుతూ నేడు స్వేచ్ఛ భారతావనిలో మనం జీవించడానికి స్వతంత్ర సమరయోధులు ఎంతగానో కృషి చేశారని వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పసల అన్నమేరి శౌరీ, ఉపసర్పంచ్ తక్కళ్ళ శ్రావణి, సంఘం ఉపాధ్యక్షులు కాల్కురి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కాల్కురి శంకరయ్య, నాయకులు చంద్రయ్య, శంకరయ్య, శ్రీను, బాలరాజు, మల్లేశం, మధు తదితరులు పాల్గొన్నారు.