రజక సంఘం ఆధ్వర్యంలో...
Published: Monday August 16, 2021
మండల పరిధిలోని వెల్వర్తి గ్రామంలో 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామంలోని వీరభద్ర రజక సేవా సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కాల్కురి సత్తయ్య మాట్లాడుతూ నేడు స్వేచ్ఛ భారతావనిలో మనం జీవించడానికి స్వతంత్ర సమరయోధులు ఎంతగానో కృషి చేశారని వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పసల అన్నమేరి శౌరీ, ఉపసర్పంచ్ తక్కళ్ళ శ్రావణి, సంఘం ఉపాధ్యక్షులు కాల్కురి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కాల్కురి శంకరయ్య, నాయకులు చంద్రయ్య, శంకరయ్య, శ్రీను, బాలరాజు, మల్లేశం, మధు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: