పేదలకు అల్పాహార పంపిణీ మంచిర్యాల బ్యూరో, జనవరి12, ప్రజాపాలన :

Published: Friday January 13, 2023

మంచిర్యాల వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని గురువారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోగులకు, పేదలకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జోన్ చైర్మన్ కేశెట్టి వంశీకృష్ణ మాట్లాడుతూ, యువతకు మార్గదర్శకగా నిలిచిన స్వామి వివేకానందుడు చెప్పిన మార్గం అందరూ పాటించాలని కోరారు . ప్రపంచంలో దేశానికి ఖ్యాతిని సాధించి పెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు తాటిపల్లి సాయి వర్ధన్,  కార్యదర్శి కేశ సాయి శరత్ , కోశాధికారి సంక శివ హేమంత్ పాల్గొన్నారు.