రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

Published: Thursday February 16, 2023
శంకరపట్నం ఫిబ్రవరి 15 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామంలో జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు డ్రోన్ ద్వారా ఫర్టిలైజర్స్ స్ప్రే చేయడం ఎలాగో డెమోనిస్ట్రేషన్ డెమో చేసి చూపించారు. దీనిద్వారా రైతులకి కూలీల ఖర్చు తగ్గడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుందని, రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కెవికె శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి, మహేష్ లు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, కొత్తగట్టు గ్రామ కో-ఆర్డినేటర్ రమేష్, ఏఈఓ శ్రావణి, గ్రామ రైతులు పాల్గొన్నారు.