గొర్రెల పంపిణీ ప్రకటనతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం : మల్లాపూర్ యాదవుల సంఘం

Published: Friday July 23, 2021
మల్లాపూర్, జులై 22 (ప్రజాపాలన ప్రతినిధి) : యాదవులకు రెండవ విడత గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కృతజ్ఞతగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో వారి సంఘం భవనంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చిత్రపటాలకు గురువారం పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. జడ్పిటిసి తో పాటు మల్లాపూర్ యాదవ సంఘం అధ్యక్షులు గుజ్జె గంగారాజాం, మండల ప్రజాప్రతినిధులు, యాదవ సంఘం సభ్యులు కలిసి కేసీఆర్, ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. యాదవ సభ్యులు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టి ఆర్ యస్ అధ్యక్షులు తోట శ్రీనివాస్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు కదుర్క నర్సయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కోమ్మల జీవన్ రెడ్డి, రాష్ట యువజన విభాగం సభ్యులు నత్తి నర్సయ్య, క్యాతం జీవన్ రెడ్డి, శరత్ గౌడ్, బండి లింగస్వామి గౌడ్, మ్యాకల సతీష్, అరికంటి మల్లేష్, యాదవ సభ్యులు వేల్పుల రాజా గంగారాం, పంచతి లక్ష్మణ్, తోట్ల చిన్న భూమారెడ్డి, తాలూకా రాజ మల్లయ్య, కంటే నర్సయ్య, జాల రెడ్డి, జాల నాగరాజు, వేల్పుల రాజం, అల్లే చంద్రయ్య, నక్క శ్రీనివాస్, తొట్ల మల్లయ్య, కంటే నరేష్ అప్పాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.