వామపక్షాలు బలపరచిన ఎం ఎల్ సీ అభ్యర్థి జయసారధిరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ సిపిఐ సీపీఎ

Published: Thursday March 04, 2021

మధిర మార్చి 4 ప్రజాపాలన ప్రతినిధి: మధిర పట్టణంలో మరియు మండలంలోని పలుగ్రామాలలో సిపిఐ సీపీఎం నాయకులు కార్యర్తలు మార్చి 14 వ తారీకున జరగబోయే ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో జయసారధిరెడ్డి గారికి తమ అమూల్య మైన ఓటును మొదటి ప్రాధాన్యత ఓటు గా ఇవ్వాలి అని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్బంగా బెజవాడ రవి, శీలం నరసింహారావు, మందా సైదులు, ఊట్ల కొండ మాట్లాడుతూ రాబోయే MLC ఎన్నికలలో పట్టభద్రులైన రైతు బిడ్డలు, నిరుద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, అందరూ ఏకమై కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు, అందరూ కలసి కట్టుగా ఒకే మాటగా జయసారధిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించి కెసిఆర్ గారి కళ్ళు భూమి మీదకు వచ్చేవిధంగా బుద్ధిచెప్పాలని పట్టభద్రులను కోరినారు ఈ ప్రచారంలో మురళి, చెరుకూరి వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ , మొదలగువారు పాల్గొన్నారు.