క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ నాయకులు మర్రి నిరంజన

Published: Friday January 14, 2022
ఇబ్రహీంపట్నం జనవరి తేది 13 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు యువకులు మత్తుపానీయాలు వీడి క్రీడలు వైపు మొగ్గు చూపాలి అంటూ ఆయన తెలిపారు. ఎమ్మెన్నార్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వినోద మూర్తి, నోముల & లింగం పల్లి ఎంపిటిసి జయ నందం, ఐలయ్య, లక్ష్మణ్ జి, మహేందర్, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజ్, యాదగిరి, శివ గౌడ్, నవీన్, శ్రీను, లింగం మరియు లింగం పల్లి గ్రామ క్రికెట్ క్రీడాకారులు, గ్రామ పెద్దలు, ఎమ్మెన్నార్ టీం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.