జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శాలను అనుసరించాలి

Published: Monday October 03, 2022
 వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 2 అక్టోబర్ ప్రజాపాలన :  జాతీపిత మహాత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు.
ఆదివారం మాహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో గాంధీ చిత్ర పటానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  సత్యాగ్రహమే అయుధంగా శాంతి, అహింస మార్గములో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహానీయుడు మహాత్మగాంధీ అని కొనియాడారు. వారు చూపిన మార్గములో పయనించి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి కోటాజీ, కలెక్టర్ కార్యాలయ ఏ. ఓ. అమరేందర్, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.