మున్సిపల్ ఉద్యోగిపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలిమధిర రూరల్

Published: Saturday December 03, 2022
డిసెంబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు మున్సిపాలిటీ ఉద్యోగి పై దాడి ఖండిస్తూమధిర మున్సిపాలిటీ ఉద్యోగులు నిరసన తెలుపుతూ దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలనిి మధిర మున్సిపాలిటీ ఉద్యోగులు ఖండిస్తూనర్సంపేట మున్సిపాలిటీలో  టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న సునీల్ పైన దుర్భషలాడి దాడి చేసి గాయపరిచిన ఘటనను మధిర మున్సిపల్ ఉద్యోగులు తీవ్రంగా ఖండిస్తున్నట్టు  తెలియజేశారు . ఈ ఘటనకు కారకుడైన  స్థానిక కౌన్సిలర్ పెండెం రామానాదం పై  చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేస్తు,ఈ ఘటనకు నిరసనగా మధిర మున్సిపల్  ఉద్యోగులు అందరు కలిసి నిరసన తెలియజేశారు.