మిషన్ అంత్యోదయ సర్వేపై శిక్షణా కార్యక్రమం

Published: Saturday March 11, 2023
బోనకల్, మార్చి 10 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో బోడిపూడి వేణుమాధవ్ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు "మిషన్ అంత్యోదయ" సర్వేపై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం చిరునోముల గ్రామపంచాయతీలో నర్సరీ , వర్క్‌సైట్‌ను పరిశీలించి మస్టర్ రోల్‌ను ధ్రువీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ సుబ్రహ్మణ్య శాస్త్రి,గ్రామపంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.