జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన మాటూరు విద్యార్థులు మధిర

Published: Thursday August 18, 2022
ఆగస్టు 17 ప్రజాపాలన ప్రతినిధి  మున్సిపాలిటీపరిధిలో బుధవారం నాడుస్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో  భాగంగా మధిర టీవీయం ఉన్నత పాఠశాలలో జరిగినటువంటి ఫ్రీడమ్ కప్ జోనల్  ఖో ఖో పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన కందుల సిద్ధార్థ ఎరగర్ల భవ్యశ్రీ లు జిల్లా పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయికృష్ణమాచార్యులు తెలిపారు.
విద్యార్థులను జిల్లా పోటీలకు ఎంపిక అయ్యేలా తీర్చిదిద్దిన పిఈటీరమాదేవిని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ మేడిశెట్టి రామకృష్ణారావు గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించడం జరిగింది.