బేడ బుడగ జంగాల పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ

Published: Monday June 14, 2021
మేడిపల్లి, జూన్13 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తి రెండోదశలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సందర్భంగా మల్లాపూర్ జున్నురం కొట్రస్ కాలనీలో నివశిస్తున్నా బేడ బుడగ జంగాల పేద కుటుంబాలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు గగనం వెంకటస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బేడా బుడగ జంగం జాతీయ ఉపాధ్యక్షులు తూర్పాటి పాండు, తూర్పాటి హనుమంతు, బేడ బుడగ జంగం దండు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, విద్యార్థి సంఘం యూత్ అధ్యక్షులు కొండపల్లి గిరి హాజరై బేడ బుడగ జంగాల పేదలకు బియ్యం, పప్పు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ అధ్యక్షులు గగనం దుర్గాప్రసాద్, కడమంచి శంకర్, గిరి, బిసయ్య, తూర్పాటి శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.