భవిష్యత్ తరాలకు రక్షణ కవచం మొక్కలే
Published: Friday July 09, 2021
నేడు నాటిన మొక్కలే భవిష్యత్ తరాలకు రక్షణ కవచంలా ఉంటాయని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గంచెరువు మల్లేశం అన్నారు. గురువారం మర్పల్లి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. నాటిన మొక్కల సాసర్ గుంతలు తవ్వి కంచె ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పచ్చని మొక్కల ద్వారా స్వచ్ఛమైన ఆక్సీజన్ లభిస్తుందని హితవు పలికారు. వైస్ చైర్మన్ డి.లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ కార్యదర్శి అనిల్ బాబు, డైరెక్టర్లు మొరంగపల్లి క్రిష్ణ, జి.గోపాల్ రెడ్డి టి.వేంకటేశం, కార్తీక్, నాగరాజు, సర్దార్, రవివర్మ, శారదబాయి, పెంటయ్య, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: