ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి ఓటరు జాబితా నుంచి తోలగించిన ఓటర్ల వివరాలను

Published: Thursday April 13, 2023

హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి.రవికిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో ఓటర్ జాబితా, పి.ఎస్.ఈ ఎంట్రీ ధృవీకరణ, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఫోటో సిమిలర్ ఎంట్రీ పరిశీలన చేసి డబుల్ ఎంట్రీ, డుప్లికేట్ లను తోలగించామని , ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తొలగించిన ఓట్ల వివరాలు అధికంగా ఉన్నందున మరోసారి పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారి ఓట్లు, మరణించిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లు జాబితా నుంచి తొలగించామని, తొలగించిన ఓట్లకు సంబంధించి సంపూర్ణ సమాచారం మన వద్ద అందుబాటులో ఉండాలని, తొలగించిన ఓట్ల వివరాలు మరోసారి పరిశీలించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అవసరమైన డాక్యుమెంట్లు ఉన్నాయో లేవో ధ్రువీకరించాలని ఆయన పేర్కొన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో బూత్ స్థాయి అధికారులు కీలకపాత్ర పోషిస్తారని, ప్రైవేట్ వ్యక్తులను బూత్ స్థాయి అధికారులుగా నియమించవద్దని, ఎక్కడైనా అలా ఉంటే 7 రోజులలో తొలగించి ప్రభుత్వ సిబ్బందిని నియమించాలని ఆయన సూచించారు. ఓటర్ జాబితాబ్ కు సంబంధించిన సమాచార హక్కు చట్టం దరఖాస్తులను సకాలంలో సమాధానం అందించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోన్ని ఓటర్ ఐడి కార్డులలో పుట్టిన రోజు తేదీలు ఒకే విదంగా ఉన్నాయని వాటి వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి సవరించాలని ఆయన పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ అర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా జాబితా నుండి తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, వివిధ కారణాల వల్ల ఓటర్ల జాబితా నుండి తొలగించిన పేర్లను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించి, పోలింగ్ స్టేషన్ వారీగా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాజేందర్ నగర్ ఆర్డీఓ చంద్రకళ, షాద్ నగర్ ఆర్డీఓ రాజేశ్వరి, చేవేళ్ల ఆర్డీఓ వేణుగోపాల్, కందుకూర్ ఆర్డీఓ సూరజ్ సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.